Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు!

ఠాగూర్
బుధవారం, 8 జనవరి 2025 (16:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించే చర్యల్లో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి మాత్రమే ఇకపై పబ్లిక్ పరీక్షలను నిర్వహిస్తారు. సీబీఎస్ఈ విధానంతో ముందుకు సాగుతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. జాతీయ నూతన విద్యా విధానం చట్టాన్ని అనుసరించి ఈ సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. 
 
సైన్స్, ఆర్ట్స్, లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని ఆమె తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం 2025-26 నించి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ప్రవేశపెడుతున్నామని, దీనివల్ల నీట్, జేఈఈ వంటి జాతీయ పోటీ పరీక్షలకు సులభతరం అవుతుందని చెప్పారు. సీబీఎస్ఈ విద్యా విధానంతో ఇకపై ముందుకు సాగుతామన్నారు. ఇక నుంచి మొదటి సంవత్సరం పరీక్షలను ఆయా కాలేజీలే అంతర్గతంగా నిర్వహిస్తాయని, ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను మాత్రం ఇంటర్ బోర్డు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ సంస్కరణలపై ఈ నెల 16వ తేదీలోపు సూచనలు, సలహాలు పంపించవచ్చని పేర్కొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments