Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కు బిగుస్తున్న ఉచ్చు...

ఠాగూర్
సోమవారం, 7 అక్టోబరు 2024 (19:01 IST)
గత వైకాపా ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారుల్లో కొందరు వైకాపా ఆఫీసర్లుగా నడుచుకున్నారు. ఇలాంటి వారి మెడకు ఇపుడు ఉచ్చు బిగుస్తుంది. పలువురు బాధితులు వచ్చి ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో వారిపై కేసులు నమోదవుతున్నాయి. 
 
తాజాగా టీడీపీ ఉండి ఎమ్మెల్యే, వైకాపా మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. నగరంపాలెం పోలీస్ స్టేషన్‌‍లో దాఖలైన ఫిర్యాదుకు సంబంధించిన అభియోగాలపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని జీఏడీ రాజకీయ కార్యదర్శి ఎస్.సురేశ్ కుమర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 
 
ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబర్ 1695ను విడుదలచేసింది. అభియోగాలపై వివరణ ఇచ్చే క్రమంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చే ప్రయత్నం చేసినా పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. సునీల్ కుమార్ తన వివరణను లిఖితపూర్వకంగా ఇవ్వాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఆయన చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments