Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గత ప్రభుత్వంలా మేం తప్పులు చేయలేం : ఆర్-5 జోన్‌ లబ్దిదారులకు శుభవార్త!!

Chandra babu

వరుణ్

, మంగళవారం, 6 ఆగస్టు 2024 (16:59 IST)
గత ప్రభుత్వంలా అడ్డుగోలు తప్పులు తాము చేయలేమని, అందువల్ల ఆర్-5 జోన్ లబ్దిదారులకు వారి సొంత స్థలాల్లోనే ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాలు కేటాయించాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇతర ప్రాంతాల పేదలకు అమరావతిలో స్థలాలు కేటాయించలేమని, వారివారి సొంత స్థలాల్లోనే స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. సోమవారం అమరావతిలో జిల్లాల కలెక్టర్ల సమావేశం జరిగింది. ఇందులో సీఎం చంద్రబాబు ఆర్-5 జోన్‌పై ప్రత్యేకంగా చర్చించారు. ఆర్-5 జోన్ లబ్దిదారులకు వాళ్ల వాళ్ల ప్రాంతాల్లోనే ఇళ్లు కేటాయించాలని సీఎం  చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 
 
ఆర్-5 జోన్ లబ్దిదారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వారి కోసం భూసేకరణ చేపట్టాలని, అవసరమైతే టిడ్కో గృహాల తరహాలో ఇల్లు కట్టించి ఇవ్వాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పేదలను తీసుకొచ్చి అమరావతిలో ఆర్-5 జోన్‌ ఏర్పాటు చేసి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడం తెలిసిందే. ఆ విధంగా తీసుకొచ్చిన పేదలకు వారి సొంత ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామే తప్పా.. వారికి అమరావతిలో స్థలాలు కేటాయించలేమని చంద్రబాబు స్పష్టంచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగ్లాదేశ్‌లో అస్థిరత - ప్రభుత్వ సలహాదారుడుగా నోబెల్ బహుమతి గ్రహీత!!