Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ ఆంక్షల్లో సడలింపులు.. వస్త్ర - చెప్పులు - గోల్డ్ షాపులకు ఓకే

Webdunia
మంగళవారం, 26 మే 2020 (16:30 IST)
ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఆంక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ఇందుకోసం మంగళవారం కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ సడలింపుల్లో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో వస్త్ర, బంగారు ఆభరణాల దుకాణాలు తెరుచుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు పురపాలక శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అయితే, విధిగా కొన్ని నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. 
 
ఈ నిబంధనల్లో భాగంగా, పెద్ద దుకాణాల్లో షాపింగ్‌కు ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని సూచించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, అన్ని వస్త్ర దుకాణాల్లో ట్రయల్ రూమ్‌లకు అనుమతి నిరాకరించారు. 
 
ఇకపోతే బంగారు, వెండి నగల షాపుల్లో డిస్పోజబుల్ గ్లోవ్స్‌ను విధిగా ఉపయోగించాలని పేర్కొంది. షాపుకు వచ్చే ప్రతి కష్టమర్‌కు ఈ గ్లోవ్స్ ఇవ్వాలని సూచన చేసింది. ఆ తర్వాత వీటిని డస్ట్‌బిన్‌లో వేయాలని పేర్కొంది. 
 
ఇకపోతే, పుడు బళ్లపై ఆహార పదార్థాలు అమ్మేవారు తప్పనిసరిగా మాస్కులు, చేతులకు గ్లోవ్స్ ధరించాలని స్పష్టం చేశారు. వీధి బళ్లపై అమ్మే ఆహారాన్ని అక్కడే తినకుండా చూడాలని, పార్శిల్ ఇవ్వాలని సూచించారు. అయితే, పానీ పూరీ బండ్లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments