Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఐదేళ్లలో ఒకటో తారీఖున జీతాలు పడిన దాఖలాలు లేవు : సూర్య నారాయణ

ఠాగూర్
ఆదివారం, 12 మే 2024 (10:29 IST)
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకటో తారీఖున ఒక్కటంటే ఒక్కసారి కూడా వేతనాలు పడిన దాఖలాలు లేవని  ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్‌ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ, పీఆర్సీ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని.. ఈ ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం, పెన్షన్‌ అందలేదని ఆయన ఆరోపించారు. 
 
'ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల కోసం నిరసనలు, ఆందోళనలు చేస్తే ప్రభుత్వం నిరంకుశంగా అణచివేసింది. సమస్యలపై ప్రతిపక్ష నేతలను కలవడాన్ని సైతం నేరంగా పరిగణించింది. ఆర్థిక చెల్లింపులపై ఉన్న మార్గదర్శకాలను చట్టంగా మార్చాలని.. దాని ప్రకారం గడువు లోపు చెల్లించకపోతే ప్రభుత్వాన్ని ప్రాసిక్యూట్‌ చేసే అవకాశం ఉంటుందని గవర్నర్‌ను కలిసి విన్నవిస్తే, సర్కారు మాపై కక్షసాధింపులకు పాల్పడింది. ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎఫ్‌ నిధులను దొంగతనంగా తీసేసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీన్ని నేరంగా పరిగణించి బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్‌ చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు అమ్ముకోవడంపై చర్యలు తీసుకుంటామని సీఈవో చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments