29 నుంచి ఏపీలో కరోనా టీకాల పంపిణీ .. ముందు ఓ లారీ డ్రైవర్‌కు..

Webdunia
ఆదివారం, 27 డిశెంబరు 2020 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే... తొలుత కృష్ణా జిల్లా నుంచి కరోనా టీకాలను పంపిణీ చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. అదీకూడా తొలి టీకాను ఓ లారీ డ్రైవర్‌కు వేయాలని భావిస్తోంది. 
 
ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్‌ను కట్టడి చేసే క్రమంలో అనేక దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. భారత్‌లోనూ మరికొన్నిరోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ షురూ కానుంది. 
 
అయితే, వ్యాక్సిన్ పంపిణీ వేళ తలెత్తే సమస్యలను అంచనా వేయడానికి దేశంలో నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించనున్నారు. ఏపీలో ఈ మాక్ డ్రిల్‌కు సంబంధించిన సన్నాహాలకు ప్రభుత్వం తెరలేపింది. రాష్ట్రంలో అందుకోసం కృష్ణా జిల్లాను ఎంపిక చేశారు.
 
జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో కో-విన్ అనే యాప్ ద్వారా వ్యాక్సిన్ అందించేవారి జాబితా రూపొందిస్తారు. ఈ డ్రై రన్ ప్రక్రియలో వైద్య బృందాలు కూడా పాల్గొంటాయి. 
 
దీనిపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ, ఈ నెల 27 నుంచి  29 వరకు కరోనా వ్యాక్సిన్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆదివారం యాప్‌కు సంబంధించిన మాక్ డ్రిల్ చేపడతామని, ఎల్లుండి వ్యాక్సిన్ రవాణా, పంపిణీ, ఈ నెల 29న వ్యాక్సిన్ ట్రయల్ రన్ ఉంటుందని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments