Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో కొత్తగా 357 కరోనా కేసులు.. నలుగురు మృతి

Advertiesment
Andhra Pradesh
, శుక్రవారం, 25 డిశెంబరు 2020 (18:52 IST)
కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే వుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. తాజాగా ఏపీలో కొత్తగా 357 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,80,430కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. 
 
ఇప్పటివరకు కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా 7,091 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 3,861 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి 8,69,478 మంది రికవరీ అయ్యారు. కొత్తగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా మృతి చెందారు.
 
కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కరోనా కేసులు తగ్గడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇప్పుడు ప్రజలను స్ట్రెయిన్ వైరస్ కలవర పెడుతోంది. యూకే నుంచి జిల్లాకు వచ్చిన వారి కోసం విజయవాడలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆస్పత్రిలో 300 బెడ్లను ఏర్పాటు చేశారు. వీటిలో 150 కోవిడ్, మరో 150 బెడ్లను నాన్ కోవిడ్ పేషెంట్లకు కేటాయించారు. 
 
యూకే నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి.. పరిస్థితిని బట్టి వారిని సంబంధిత వార్డుల్లో క్వారంటైన్ చేస్తున్నారు. కాగా, స్ట్రెయిన్ కలకలం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను అలెర్ట్ చేశాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#Rajinikanth త్వరలో కోలుకోవాలి.. పవన్ కల్యాణ్ ఆకాంక్ష