Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో చనిపోయిన కండక్టర్ కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (11:51 IST)
కడపను వరదలు ముంచెత్తాయి. అన్నమయ్య జలాశయం ప్రమాదంలో పడింది. నీటికి బయటికి పంపడంతో ఐదో గేటు సాంకేతిక లోపంతో మొరాయించింది. అంతే ఇక జరగాల్సింది జరిగిపోయింది. ఇంకా ముందు చూపు కొరవడటంతో వరద ముంపు ముంచేసినట్లు తెలుస్తోంది. 
 
ఈ వరద కాస్త కడప- రేణిగుంట జాతీయ రహదారిలోకి వస్తుందని ఎవరూ గుర్తించ లేదు. ఆర్టీసీ  బస్సులు ప్రమాదంలో చిక్కుకునే వరకు యంత్రాంగం స్పందించలేదు. అంతే రాజం పేట వరదలో ఆర్టీసీ బస్సులో ముగ్గురు మృతి చెందారు. 
 
ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. కడప జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బస్సులో చనిపోయిన కండక్టర్ కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం ప్రకటించారు. మరో ఇద్దరు ప్రయాణీకుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. 
 
కడప ఆర్టీసీ గ్యారేజ్‌కు రూ.10 కోట్లతో త్వరలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 1800 ఆర్టీసీ సర్వీసులకు రద్దు చేసినట్లు చెప్పారు. కడప, రాజంపేట మీదుగా తిరుపతికి ఇవాళ సర్వీసులు రద్దు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments