Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో చనిపోయిన కండక్టర్ కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (11:51 IST)
కడపను వరదలు ముంచెత్తాయి. అన్నమయ్య జలాశయం ప్రమాదంలో పడింది. నీటికి బయటికి పంపడంతో ఐదో గేటు సాంకేతిక లోపంతో మొరాయించింది. అంతే ఇక జరగాల్సింది జరిగిపోయింది. ఇంకా ముందు చూపు కొరవడటంతో వరద ముంపు ముంచేసినట్లు తెలుస్తోంది. 
 
ఈ వరద కాస్త కడప- రేణిగుంట జాతీయ రహదారిలోకి వస్తుందని ఎవరూ గుర్తించ లేదు. ఆర్టీసీ  బస్సులు ప్రమాదంలో చిక్కుకునే వరకు యంత్రాంగం స్పందించలేదు. అంతే రాజం పేట వరదలో ఆర్టీసీ బస్సులో ముగ్గురు మృతి చెందారు. 
 
ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. కడప జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బస్సులో చనిపోయిన కండక్టర్ కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం ప్రకటించారు. మరో ఇద్దరు ప్రయాణీకుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. 
 
కడప ఆర్టీసీ గ్యారేజ్‌కు రూ.10 కోట్లతో త్వరలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 1800 ఆర్టీసీ సర్వీసులకు రద్దు చేసినట్లు చెప్పారు. కడప, రాజంపేట మీదుగా తిరుపతికి ఇవాళ సర్వీసులు రద్దు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments