Webdunia - Bharat's app for daily news and videos

Install App

అణగదొక్కాలని చూస్తే ఇంకా పైకి లేస్తాం

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (15:32 IST)
వైకాపా ఆరునెలల పాలనంతా కూల్చివేతలు, దౌర్జన్యాలు, తెదేపా నేతలపై కేసుల పెట్టి బెదిరించడంతోనే సరిపోయిందని చంద్రబాబు ఆక్షేపించారు. తమ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి జగన్ ప్రణాళికలు రచిస్తున్నారని.. ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొనే ధైర్యం తమకు ఉందని చెప్పారు. 
 
ఇప్పటివరకు తమ పార్టీ నేతలపై 51 కేసులు నమోదు చేశారని వివరించారు. తెదేపాను అణగదొక్కాలని చూస్తే ఇంకా పైకి లేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. తాము కూడా గత ఐదేళ్లలో కక్ష పూరితంగా వ్యవహరించి ఉంటే ఒక్క వైకాపా కార్యకర్త కూడా మిగిలేవాడు కాదని వ్యాఖ్యానించారు. ఇసుక కొరత లేదని సీఎం చెబుతున్నారని.. కడప ఇసుక బెంగళూరులో ప్రత్యక్షమవుతోందని చెప్పారు. 
 
వైకాపా ప్రభుత్వ పాలన తిరోగమనం వైపు సాగుతోందని.. కేవలం పులివెందుల, పుంగనూరుకు మాత్రమే నిధులు విడుదల చేస్తే మిగిలిన 173 నియోజకవర్గాల పరిస్థితి ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని.. ఎప్పుడూ ఇదే ప్రభుత్వం ఉంటుందనే భ్రమలు వీడాలని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trivikram: వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడింది

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments