Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్

ఠాగూర్
సోమవారం, 20 మే 2024 (09:20 IST)
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన జరిగింది. ఈ ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. ఆయన భార్య లావణ్య దేవి విశాఖపట్టణం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. అయితే, ఈ నెల 4వ తేదీన భర్త తరపున ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదులు వెల్లడంతో ఆమెకు షోకాజ్ నోటీసు జారీచేశారు. అందులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పేర్కొన్నారు. 
 
ఈ నోటీసులకు స్పందించిన లావణ్య... తాను శ్రీవాణి అనే మహిళను కలిశానని, ఎలాంటి ఎన్నికల ర్యాలీలో పాల్గొనలేదని వివరణ ఇచ్చారు. అయితే, ఈ వివరణపై సంతృప్తి చెందని రిటర్నింగ్ అధికారి.. అసిస్టెంట్ ప్రొఫెసర్ లావణ్యపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌ను కోరారు. దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ ఏయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు బరిలో ఉంటే, వైకాపా నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్నారు. ఈయన గత ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై గెలుపొందిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments