Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ప్రారంభమైన ఐదో విడత పోలింగ్ - ఓటేసిన ప్రముఖులు

ఠాగూర్
సోమవారం, 20 మే 2024 (09:04 IST)
దేశ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఐదో విడత పోలింగ్ సోమవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 14 స్థానాలకు, మహారాష్ట్రలో 13, వెస్ట్ బెంగాల్‌లో 7, బీహార్‌లో 5, ఒరిస్సాలో 5, జార్ఖండ్‌లో 3, జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌లలో ఒక్కో స్థానానికి చొప్పున పోలింగ్ నిర్వహించనున్నారు. 
 
ఐదో విడతల బరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్, పియూష్ గోయల్, బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ, లోక్‌ జనశక్తి అధినేత చిరాగ్ పాశ్వాన్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తదితరులు ఉన్నారు. 
 
కాగా, ఈ సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహిస్తుండగా, ఇప్పటివరకు 4 దశల్లో 379 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. సోమవారం ఐదో దశ పోలింగ్ జరుగుతుండగా, ఈ నెల 25వ తేదీన ఆరో దశ, జూన్ ఒకటో తేదీన ఏడో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ నాలుగో తేదీ దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపడుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments