Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 19 నుంచి ఆగస్టు 25 వరకు ఏపీలో ఎంసెట్ పరీక్షలు

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (18:23 IST)
ఏపీలో ఎంసెట్ పరీక్షలకు టైమ్ టేబుల్ విడుదలైంది. ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మొదటి, రెండో వారంలో నిర్వహించే అవకాశం వుంది. ఇక ఎంసెట్ పరీక్షలు ఆగష్టు 19 నుంచి ఆగష్టు 25 వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ వెల్లడించారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణకు గతంలో సూచించిన తేదీలను సవరించి.. మరోసారి కొత్త తేదీలను ప్రకటించారు.
 
కొత్తగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం, అపరాధ రుసుము లేకుండా జూన్ 30వ తేదీ వరకు ఎంసెట్ దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు. రూ. 5000 లేట్ ఫీజుతో జూలై 7 వరకు, రూ. 10 వేలు అపరాధ రుసుముతో జూలై 14 వరకు, రూ. 15 వేలు లేట్ ఫీజుతో జూలై 22 వరకు, రూ. 20 వేలు అపరాధ రుసుముతో జూలై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు. 
 
కరోనా నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతీ సెంటర్‌ను శానిటైజ్ చేస్తామని.. విద్యార్ధుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments