Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ - ఒక పోస్టుకు 35 మంది పోటీ

ఠాగూర్
ఆదివారం, 1 జూన్ 2025 (10:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పేరుతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 16,347 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. దాదాపు 3.35 లక్షల నుంచి 5.77 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 35.33 మంది పోటీపడుతున్నారు. పీజీటీ పోస్టులకు అత్యధికంగా 152 మంది పోటీపడుతున్నారు. జూన్ ఆరు నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించి ఆగస్టు రెండో వారంలో ఫలితాలను రిలీజ్ చేశారు. 
 
ముఖ్యంగా, సెంకడరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుకు సగటున 25 మంది, స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 28 మంది చొప్పున పోటీపడుతుండగా, పోస్ట్ గ్యాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులకు మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో పీజీటీ పోస్టుకు ఏకంగా 152 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పాఠశాల ఉన్నత విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 
 
ఈ నెల 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన హాల్ టిక్కెట్లను శనివారం అభ్యర్థులకు అందుబాటులో తెచ్చారు. ఈ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాలైన హైదరాబదా్, చెన్నై, బరంపురం (ఒరిస్సా) బెంగుళూరు నగరాల్లో కలిపి మొత్తం 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం సెషన్స్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. 
 
అభ్యర్థులు తమకు సౌకర్యవంతంగా ఉండే ఐదు జిల్లాలను పరీక్షా కేంద్రాల కోసం ఆప్షన్లుగా ఎంచుకునే అవకాశం కల్పించారు. వారిలో 87.8 శాతం మందికి వారు కోరుకున్న మొదటి ప్రాధాన్యత జిల్లాలోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయించినట్టు అధికారులు తెలిపారు. పరీక్షల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆగస్టు నెల రెండో వారంలో డీఎస్సీ ఫలితాలను విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు వెల్లడించారు. ఈ భారీ నియామక ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో చాలా మేరకు ఉపాధ్యాయుల కొరత తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments