Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫర్ల్ కోసం టెంప్ట్ అయితే ఇరుక్కోక తప్పదు: ఎపీ డిజిపి గౌతం సవాంగ్ వార్నింగ్

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (19:40 IST)
ఎపీ పోలీస్ శాఖలో సిబ్బంది అవినీతిపై డీజీపీ గౌతం సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫర్లకు టెంప్ట్ అవటం వలనే పోలీసు శాఖలో అవినీతి బయటపడుతుందని, ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పోలీసు సిబ్బంది టెంప్ట్ అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. తొందరపడితే కేసుల్లో ఇరుక్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.
 
అంతేకాదు, ఇప్పటివరకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం నమోదు చేసిన కేసుల్లో 53 మంది పోలీసుల పాత్ర కూడా ఉందని వారిపై కూడా కేసులు నమోదు చేశామని డీజీపీ స్పష్టం చేశారు. సొంత శాఖలలో పని చేస్తున్న వారిపై కేసులు పెట్టటం బాధగా ఉన్నా తప్పటం లేదని ఆయన స్పష్టం చేశారు.
 
ఇలాంటి అవినీతి పనులకు పోలీసులు దూరంగా ఉండాలని డీజీపీ పిలుపునిచ్చారు. పోలీసు శాఖలో సత్ప్రవర్తన, ఫిర్యాదుదారుల పట్ల సానుకూలంగా స్పందించటంపై ఎపీలోని 76 వేల మంది పోలీసులతో వెయ్యి ప్రాంతాల నుండి ఒకేసారి డీజీపీ ఆన్లైన్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. పోలీస్ స్టేషన్లకు ఎవరూ రావాలని కోరుకోరనీ, తీరని అన్యాయం జరిగినప్పుడు మాత్రమే బాధితులు పోలీస్ స్టేషన్ తలుపు తడతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments