Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు చేసి పప్పు బెల్లాలు పంచుతున్నాం... డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (07:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి అభ్యున్నతే లక్ష్యంగా అప్పులు చేసి ప్రజలకు పంచి పెడుతున్నామని ఏపీ ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు అన్నారు. అప్పులు చేయడం తప్పు కాదన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పులు చేయలేదా అంటూ ఎదురు ప్రశ్నించారు. 
 
ఇటీవల ఏపీ మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న ఆయన సోమవారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. గత తెదేపా ప్రభుత్వం అప్పులు చేయకుండానే పాలన చేసిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని పథకాలు సక్రమంగా అమలవుతున్నప్పటికీ రాద్దాంతం చేయడం తెదేపాకు ఓ అలవాటుగా మారిందన్నారు. 
 
ముఖ్యంగా టీడీపీ హయాంలో నిధులు దారి మళ్ళింపు జరగలేదని అప్పటి సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పలేదా? అని నిలదీశారు. నీరు చెట్టు మట్టి తవ్వకాల్లో వేల కోట్ల రూపాయలు ఎక్కడకు వెళ్లాయని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lakshmi Manchu: కళను రాజకీయం చేయవద్దు... మంచు లక్ష్మీ కామెంట్స్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments