Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం జగన్ ఏపీ వైద్య రంగాన్ని ఏక్కడికో తీసుకెళ్లారు : ఆరోగ్య మంత్రి రజని

vidadala rajani
, సోమవారం, 18 ఏప్రియల్ 2022 (14:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య రంగాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికో తీసుకెళ్లి, దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి విడదల రజని వెల్లడించారు. ఆమె రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం జగన్ ఏపీ వైద్య రంగాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ముఖ్యంగా, నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. 
 
రాష్ట్రంలో బీసీలకు ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత ప్రాధాన్యతను సీఎం జగన్ ఇచ్చారన్నారు. బీసీలు ఎప్పటికీ జగన్ వెంటే ఉంటారని చెప్పారు. తెలంగాణాలో పుట్టిపెరిగిన రజనీ.. ఇపుడు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈమె చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిందువులు ఎక్కువ మందిని కనాలి : యతి సత్యదేవానంద్ సరస్వతి