Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీఎస్ఆర్టీసీ దొంగదెబ్బ : రిజర్వేషన్ చార్జీల పెంపు

Advertiesment
tsrtc
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు దొంగదెబ్బ కొట్టింది. ప్రయాణికులపై అదనపు భారం మోపింది. ఇప్పటికే రెండుసార్లు బస్సు చార్జీలు పెంచిన ఆర్టీసీ.. ఇపుడు మరో పిడుగు వేసింది. గుట్టుచప్పుడు కాకుండా రిజర్వేషన్ చార్జీలను పెంచేసింది. అయితే, ఈ పెంపు భారంపై ఆర్టీసి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 
 
ఒక్కో ప్రయాణ టిక్కెట్ రిజర్వేషన్ చార్జీపై రూ.20 నుంచి రూ.30 వరకు పెంచేసింది. ఈ పెంచిన చార్జీలు కూడా తక్షణం అమల్లోకి రానున్నాయి. దీంతో టిక్కెట్ చార్జీలు మరింతగా పెరగనున్నాయి. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ బాదుడు చాలదన్నట్టుగా మరోమారు ఆర్టీసీ చార్జీలు పెరుగుతాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించడంపై ప్రయాణికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నదూరాలకు కూడా టిక్కెట్ చార్జీలను పెంచడంతో ప్రయాణికులు గగ్గోలుపెడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం బాబులకు దుర్వార్త - మద్యం షాపులు బంద్