Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. వజ్ర మినీ బస్సులు వచ్చేశాయిగా!

ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. వజ్ర మినీ బస్సులు వచ్చేశాయిగా!
, శుక్రవారం, 25 మార్చి 2022 (22:32 IST)
mini bus
టీఎస్‌ఆర్టీసీ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లోని ఐ‌టి కంపెనీలు ఎక్కువగా ఉండే హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మాధాపూర్ తదితర ప్రాంతాలలో వజ్ర బస్ సర్వీసులను ప్రవేశపెట్టింది. అక్కడ ఐ‌టి కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు మెట్రో స్టేషన్ల నుంచి తమ కార్యాలయాలకు మళ్ళీ సాయంత్రం మెట్రో స్టేషన్లు చేరుకొనేందుకు ఆటోలు, బస్సులు, క్యాబ్‌లలో ప్రయాణిస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. 
 
దీనిని ఓ మంచి వ్యాపారవాకాశంగా గుర్తించిన టీఎస్‌ఆర్టీసీ ఈ ప్రాంతాలలో మెట్రో స్టేషన్లు, ఐ‌టి కంపెనీలను కలుపుతూ వజ్ర మినీ బస్ సర్వీసులను ప్రారంభించింది. ఐ‌టి కంపెనీలున్న ఐ‌టి కారిడార్‌లోనే రోజుకి సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు.
 
కనుక నగరంలోని జేఎన్‌టీయూ- వేవ్‌రాక్ మధ్య ఈ వజ్ర మినీ ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ మినీ బస్సులలో సైబర్‌టవర్స్, మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, డీఎల్‌ఎఫ్, ఇన్ఫోసిస్, విప్రో, ఐసీఐసీఐ, అమెజాన్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని పలు ప్రాంతాలకు మళ్ళీ మెట్రో స్టేషన్లకు అతి తక్కువ చార్జీలతో చేరుకోవచ్చు. 
 
జేఎన్‌టీయూ నుంచి వేవ్‌ రాక్‌ వరకు ఉదయం 8గంటల నుంచి 8.30, 9.50, 10.20 గంటలకు మళ్ళీ సాయంత్రం 4.25, 4.55, 6.15, 6.45 గంటలకు బస్సులు బయలుదేరుతాయి.  
 
అదేవిదంగా వేవ్‌రాక్‌ నుంచి జేఎన్‌టీయూకి ప్రతీరోజు ఉదయం 8.50, 9.20 గంటలకు బయలుదేరుతాయి. మళ్ళీ సాయంత్రం 3.35, 4.05, 5.25, 5.55 గంటలకు వరుసగా బస్సులు బయలుదేరుతాయి.  
 
ఛార్జీలు: జేఎన్‌టీయూ నుంచి మైండ్‌స్పేస్‌కు రూ.20, వేవ్‌రాక్‌కు రూ.40, మైండ్‌స్పేస్‌ నుంచి వేవ్‌రాక్‌కు రూ.20 టికెట్ ధర నిర్ణయించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదే: సీఎం జగన్