Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభుత్వ ఉద్యోగాలకు నిరుద్యోగుల గరిష్ట వయో పరిమితి పెంపు

ప్రభుత్వ ఉద్యోగాలకు నిరుద్యోగుల గరిష్ట వయో పరిమితి పెంపు
, ఆదివారం, 20 మార్చి 2022 (10:55 IST)
ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిరుద్యోగుల గరిష్ట వయో పరిమితిని పొడగిస్తూ జీవో జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరిట ఈ జీవో జారీ అయింది. 
 
ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి ప్రస్తుతం 34 సంవత్సరాలుగా ఉంది. దీన్ని 41 యేళ్లకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నంబరు 42ను జారీచేసింది. ఈ సడలింపు నిర్ణయం వచ్చే రెండేళ్ల పాటు అంటే 2024 మార్చి 18వ తేదీ వరకు ఉంటుంది. 
 
అయితే, ఈ మినహాయింపు పోలీస్, ఎక్సైజ్, జైళ్ళ, అటవీశాఖ వంటి యూనిఫాం సర్వీసులకు వర్తించదు. కాగా, 80039 ఉద్యోగ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీంతో వయోపరిమితి దాటిన వారికి కూడా లబ్ది చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.... ఏంటది?