Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూముల అమ్మకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ సర్కారు!!

Webdunia
గురువారం, 14 మే 2020 (08:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకానికి శ్రీకారం చుట్టింది. నవరత్న హామీల అమలుకోసం అవసరమైన నిధుల సమీకరణంలో భాగంగా, ఈ భూములను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి విక్రయించనుంది. 
 
తొలి విడతలో విశాఖపట్టణం, గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో ఉన్న భూమిని వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 29న ఈ భూముల విక్రయానికి సంబంధించిన వేలం పాట ప్రారంభంకానుంది. ఈ భూములు అమ్మడం వల్ల వచ్చే నిధులను నవరత్నాలు, నాడు - నేడు వంటి కార్యక్రమాల అమలుకు వెచ్చించనుంది. 
 
ఈ వేలం ప్రక్రియను బిల్డ్ ఏపీ మిషన్ చేపట్టబోతోంది. ఈ సందర్భంగా బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ మాట్లాడుతూ, వేలంపాటలో ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. వేలం వేయాలనుకున్న తొమ్మిది స్థలాలకు రిజర్వ్ ధరగా రూ.208.62 కోట్లను నిర్ణయించినట్టు చెప్పారు. ధరావతు కింద 10 శాతం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు.
 
తొలి విడతలో విక్రయించనున్న భూముల వివరాలను కూడా ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లాలో నల్లపాడు - 6.07 ఎకరాలు, శ్రీనగర్ కాలనీ - 5.44 ఎకరాలు, మెయిన్ బీటీ రోడ్డు - 1.72 ఎకరాలు చొప్పున వేలం వేస్తారు. 
 
అలాగే, విశాఖపట్టణం జిల్లాలో చిన గడ్లీ - 1 ఎకరం, చిన గడ్లీ - 75 సెంట్లు, ఆగనంపూడి - 50 సెంట్లు, ఫకీర్ టకియా ఎస్ఈజెడ్ - 35 సెంట్లు, ఫకీర్ టకియా ఎస్ఈజెడ్ - 1.93 ఎకరాలు, ఫకీర్ టకియా ఎసీఈజెడ్ - 1.04 ఎకరాలు చొప్పున వేలం వేసి విక్రయించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments