Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనసున్న మారాజు జగనన్న... బ్యానర్లు చూసి కాన్వాయ్ ఆపి...

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (17:08 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. నిన్నటికి నిన్న ఆశా వర్కర్ల వేతనాలను 300 శాతం మేరకు పెంచిన జగన్... మంగళవారం ఓ కేన్సర్ యువకుడుకి చికిత్స చేయించాల్సిందిగా ఆదేశించారు. 
 
మంగళవారం జగన్ విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకోసం ఆయన అమరావతి నుంచి విశాఖకు ప్రత్యేక విమానంలో వెళ్ళారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శారదాపీఠానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.
 
తిరుగు ప్రయాణంలో విశాఖ విమానాశ్రయం వద్ద కొందరు యువకులు బ్యానర్లు చేతపట్టుకుని నిలుచున్నారు. నీరజ్ అనే తమ స్నేహితుడు కేన్సర్‌తో బాధపడుతున్నాడనీ, అతడికి సాయం చేయాల్సిందిగా వారు ఆ బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శించారు. 
 
అంతే.. తన కాన్వాయ్‌ను ఆపి జగన్ వాహనం దిగి వారివద్దకు వెళ్లి ఆ యువకులతో మాట్లాడారు. మీ సమస్య ఏంటని ప్రశ్నించారు. నీరజ్ అనే కుర్రోడు కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడూ హైదరాబాద్ బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడనీ అతనికి చికిత్స చేయించాలని ప్రాధేయపడ్డారు. 
 
తమ స్నేహితుడు పట్ల వారు చూపిస్తున్న తాపత్రయం జగన్‌ను కదిలించింది. వెంటనే అక్కడే ఉన్న విశాఖ జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ను పిలిచి తక్షణం చికిత్సకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. ఖర్చును అంచనా వేసి నిధులు తక్షణం విడుదల చేయాలని ఆదేశించారు. జగన్ స్పందనకు ఆశ్చర్యపోయిన నీరజ్ స్నేహితులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments