Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బాలికలకు మండలానికో జూనియర్ కాలేజీ

ys jagan
Webdunia
శుక్రవారం, 20 మే 2022 (14:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో జిల్లాకో ఎయిర్‌పోర్టు నిర్మిస్తానని చెప్పిన సీఎం జగన్ ఇపుడు మండలానికో జూనియర్ కాలేజీని స్థాపిస్తామని తెలిపారు. అదీ కూడా కేవలం బాలికలకు మాత్రమే. అందుకోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
రాష్ట్ర విద్యాశాఖపై జరిపిన సమీక్షలో భాగంగా, సీఎం జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 23975 పాఠశాలల్లో నాడు నేడు రెండో విడత కింద పనులు జరిగాయని చెప్పారు. నెల రోజుల్లో నూటికి నూరు శాతం రెండో దశ కింద పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. 
 
ముఖ్యంగా గోరుముద్దు, ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ వంటివాటి అమలుపై మరింత ధ్యాస పెట్టాలని కోరారు. గతంలో రాష్ట్రంలో సుమారు 400 జూనియర్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఇపుడు ఏకంగా 1200 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్ కాలేజీ లేదా కేజీబీవీ లేదా హైస్కూల్ ప్లస్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments