Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూసుకొస్తున్న మండూసు తుపాను.. జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశం

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (15:06 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. మాండూస్‌గా నామకరణం చేసిన ఈ తుపాను ప్రస్తుతం తీరం వైపు అమిత వేగంతో ప్రయాణిస్తుంది. ఇది శుక్రవారం అర్థరాత్రి పుదుచ్చేరి - శ్రీహరికోటల మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం చెన్నైకు 620 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
పైగా, ఈ తుపాను తీరందాటే సమయంలో గంటకు 65 నుంచి 85 కిలోమీటర్ల దూరంలో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఈ తుపాను కారణంగా ప్రకాశం, నెల్లరూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అన్నమయ్య, కడప జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేశారు. 
 
ఈ తుపాను తీరంవైపు దూసుకొస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. ముందస్తు చర్యలతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను ప్రభావంపై ఎప్పటికపుడు సమీక్షను నిర్వహిస్తూ, వాతావరణ శాఖ హెచ్చరికలు, సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ఆయన కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో తుపాను పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments