Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయసాయి రెడ్డికి షాకిచ్చిన సీఎం జగన్

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (16:13 IST)
వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేరుకోలేని షాకిచ్చారు. విశాఖ జిల్లా పార్టీ బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించి, ఆ బాధ్యతలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. అలాగే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లా సమన్వయకర్త బాధ్యతలను కూడా సుబ్బారెడ్డికే సీఎం అప్పగించారు. 
 
ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డిపై ఉత్తరాంధ్రకు చెందిన అనేక మంది సొంత పార్టీ నేతలు అనేక రకాలైన ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న సీఎం జగన్ ఆయన్ను విశాఖ బాధ్యతల నుంచి తప్పించారు. 
 
మరోవైపు, పార్టీ సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలకు ఏకంగా 62 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. విజయసాయికి ఒక్క జిల్లా బాధ్యతను కూడా అప్పగించక పోవడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో విజయసాయి ఇకపై విశాఖ నుంచి కాకుండా తాడేపల్లి కేంద్రంగా పని చేయనున్నారు. ఇదే సమయంలో సజ్జల రామకృష్ణా రెడ్డికి జగన్ మరింత ప్రాధాన్యతను కల్పించారు. పార్టీ సమన్వయకర్తలను, జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసే బాధ్యతను అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments