Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది...

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (15:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆకస్మిక ఢిల్లీ పర్యటన గురువారం ముగిసింది. బుధవారం సాయంత్రానికి హస్తినకు చేరుకున్న ఆయన.. అదే రోజు అర్థరాత్రి సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. గురువారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. 
 
వీరిద్దరి మధ్య దాదాపు 40 నిమిషాలపాటు సమావేశం జరిగింది. ఇందులో ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చ జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా, గత ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ, పోలవరం నిధుల విడుదలపై కూడా ఈ సమావేశంలో చర్చినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటు కర్నాటక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సమయంలో సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సీఎం ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు తగ్గించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments