ఆయన నా తమ్ముడయ్యా స్వామీ.. ఆయన ఎవరో కాదు....

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (12:33 IST)
ఆయన నా తమ్ముడయ్యా స్వామీ.. ఆయన ఎవరో కాదు.. అంటూ కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
మూడు రోజుల పాటు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటన ముగించుకుని సీఎం జగన్ ఆదివారం పులివెందుల నుంచి అమరావతి తాడేపల్లి ప్యాలెస్‌కు తిరుగు పయనమయ్యారు. సీఎం జగన్ హెలిప్యాడ్ వద్దకు చేరుకోగానే, ఓ వ్యక్తి అర్జీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. 
 
దాంతో జగన్.. ఆ ఆర్జీని పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి ఇవ్వాలని సూచించారు. ఆ వ్యక్తి మాత్రం జగన్‌కే ఇచ్చేందుకు మరోమారు అర్జీ పత్రంతో చేయిని ముందుకు సాచారు. 
 
దీంతో జగన్ కల్పించుకుని 'నా తమ్ముడయ్యా స్వామీ.. ఆయన ఎవరో కాదు' అంటూ అవినాశ్‌కే ఇవ్వమన్నారు. పైగా, ఆ అర్జీని తీసుకోవాలని అవినాశ్‌కు సైతం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments