Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుకను మాఫియా తన్నుకెళ్తోంది.. ఏం చేద్దాం? మంత్రులతో సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (14:50 IST)
గత ప్రభుత్వం ఇసుక విధానం వల్ల ఇసుకను మాఫియా తన్నుకెళ్తోందనీ, అందువల్ల కొత్త ఇసుక విధానాన్ని తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంత్రులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేశారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
 
సమీక్ష అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం హాజరయ్యారు. 
 
గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన విధానం వల్ల ఆదాయం అంతా మాఫియా చేతుల్లోకి వెళ్తోందని జగన్ భావిస్తున్నారు. ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకే వచ్చేలా నూతన ఇసుక విధానాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఇసుక విధానంపై ఇప్పటికే కొంత అధ్యయనం చేసిన మంత్రులు, అధికారులు ఈ సమీక్షలో జగన్‌కు వివరించారు. ఈ నేపధ్యంలో ఇసుక విధానంపై జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments