Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రచారానికి రావాలని వుంది.. కానీ రాలేకపోతున్నా.. బద్వేల్ ఓటర్లకు సీఎం జగన్

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (13:20 IST)
కర్నూలు జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో అధికార వైకాపా తరపున దాసరి సుధ పోటీ చేస్తున్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ, బీజేపీల తరపున అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటోంది. 
 
ఈ నేపథ్యంలో బద్వేలు నియోజకవర్గ ఓటర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సోమవారం ఓ లేఖ రాశారు. ఈ నెల 30న ఇక్కడ ఉప ఎన్నిక జరగనుండగా వైసీపీ నుంచి దాసరి సుధ పోటీలో ఉన్నారు. ఆమెను తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని జగన్ ఆ లేఖలో కోరారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారానికి రావాలని అనుకున్నానట్టు చెప్పారు. 
 
కానీ ఎన్నికల సంఘం నిబంధనల కారణంగా రాలేకపోతున్నట్టు చెప్పారు. తాను ప్రచారానికి వస్తే అక్కాచెల్లెమ్మలు ఒక్కసారిగా గుమికూడితే వారిలో ఏ కొందరైనా కరోనా బారినపడే అవకాశం ఉందని, వారి కుటుంబ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ప్రచారానికి రాలేకపోతున్నానంటూ పేరుపేరునా ముద్రించిన కర పత్రాలను స్థానిక నేతలు పంపిణీ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments