ఏపీలో ప్రతి 50 కిమీకి ఒక పోర్టు నిర్మాణం : సీఎం చంద్రబాబు

ఠాగూర్
మంగళవారం, 11 నవంబరు 2025 (14:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తామని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పరు. ఆయన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెద ఈర్లపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఎంస్‌ఎంఈ పార్కును ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్‌ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మంగళవారం 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించారు. 587 ఎకరాల్లో మిగిలిన 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్‌ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండం నాయునపల్లిలో చేనేత పార్కుకూ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగం చేస్తున్నాం. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. వారు ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసి వారికి అప్పగిస్తున్నాం. రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తాం.  రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్‌ను మళ్లీ తీసుకొస్తున్నాం. 
 
పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం. 20 లక్షల ఉద్యోగాలంటే చాలా మంది అవహేళన చేశారు. ఇప్పటికే చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ వారమంతా పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. పెట్టుబడులతో పాటు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. కష్టపడి పనిచేసే అద్భుత యువత ఏపీలో ఉంది. గత వైకాపా పాలనలో పారిశ్రామికవేత్తలను బెదిరించడంతో వారు పారిపోయారు' అని చంద్రబాబు అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhatti Vikramarkaఫ యువతరం ఎలా ఎదగాలనే సందేశంతో పిఠాపురంలో చిత్రం : భట్టి విక్రమార్క

చాందినీ గాయంతో కాలు నొప్పి ఉన్నా డాకూ మహారాజ్ లో పరుగెత్తే సీన్స్ చేసింది : బాబీ

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments