అమరావతి అలెర్ట్ : ప్రతి ఇంటికి పోలీసు నోటీసులు.. కొత్తవారు కనిపించారంటే..

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (09:57 IST)
రాజధాని అమరావతిని తరలించవద్దని, మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని కొన్ని రోజుల నుండి అమరావతి రైతులు మరియు ప్రజలు నిరసనలు, దీక్షల చేపడుతున్నారు. దీనిలో భాగంగా గురువారం ప్రకాశం బ్యారేజి నందు కొందరు తలపెట్టనున్న రూట్ మార్చ్, నిరసనలు, ధర్నాలకు పోలీసుల నుండి ఎటువంటి అనుమతులు లేనందున అట్టి కార్యక్రమాలు చేపట్టకుండా పోలీసు వారు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. స్టాపర్‌లు, బ్యారికేడ్ల‌తో వారిని నియంత్రించనున్నారు.
 
అమరావతి రాజధానిలోని పరిస్థితుల దృష్ట్యా 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా నడుచుకున్న లేక చట్ట వ్యతిరేక కార్యక్రమములు చేపట్టిన అట్టి వారిపై చర్యలు తప్పవని ఏపీ పోలీసు శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైపు, శుక్రవారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌ సమావేశాలు అంత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసులు సచిలవాలయం చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. క్యాబినెట్ రోజున ఇతర కొత్త వ్యక్తుల ఎవరు సచివాలయం ప్రాంతాల్లోకి రాకుండా నోటీసులు జారీచేశారు. ఈ నేపథ్యంలోనే కొత్తవారు ఎవరైన వస్తే తమకు సమాచారం అందించాలని మందడం ప్రాంతంలోని ఇళ్లకు నోటీసులు అంటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments