Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీకి అసంతృప్తి సెగ.. మంటల్లో దూకేందుకు రెడీ అయిన మహిళ

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (12:03 IST)
వైసీపీకి అసంతృప్తి సెగ తప్పలేదు. తమ తమ ప్రియతమ నేతలకు కేబినెట్ బెర్తు దక్కకపోవడంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. కొన్ని జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. గుంటూరు జిల్లాలో ఓ మహిళా కార్యకర్త మంటల్లోకి దూకుతానంటూ వీరంగం వేయడం సంచలనం రేపింది..
 
వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత తొలిసారి పార్టీలోనే సీఎం జగన్ నిర్ణయాలపై వ్యతిరేకత బాహాటంగా వ్యక్తమైంది. కొత్త మంత్రివర్గ కూర్పుపై పలు జిల్లాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేబినెట్‌లో బెర్తు దక్కని ఎమ్మెల్యేల అనుచరులు రోడ్లపైకొచ్చి నిరసనలు చేశారు. 
 
పలు చోట్ల టైర్లను తగులబెట్టి జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రకటనలు చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చాలా చోట్ల వైసీపీ కార్యకర్తలు రాస్తారోకోలు చేశారు.
 
పల్నాడు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే మాచర్ల నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి. రామకృష్ణరెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించనందుకు నిరసనగా మండల కేంద్రమైన రెంటచింతల‌లో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా రోడ్డుపై టైయర్లు తగలపెట్టారు. ఈ రాస్తారోకో నిరసన కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గం మహిళ నాయకురాలు పాముల సంపూర్ణమ్మ మంటల్లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే తేరుకున్న వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments