Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పరిణామాలపై కేంద్రం ఆరా.. జగన్ సర్కారుకు మూడినట్టేనా?

Webdunia
సోమవారం, 27 జనవరి 2020 (13:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సంకేతాలు రావడంతోనే గవర్నర్ హరిచందన్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, అటు అసెంబ్లీ స్పీకర్ తమ్మినిని సీతారాం, ఇటు మండలి ఛైర్మన్ షరీఫ్‌లతో గవర్నర్ వేర్వేరుగా మాట్లాడారు. 
 
ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో 25 మంది మంత్రులు వెళ్లి పోడియంను చుట్టుముట్టడం.. టేబుల్‌పై పేపర్లు లాగివేయడం, ఛైర్మన షరీఫ్‌ను మంత, కులం పేరుతో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ దూషించడం, షరీఫ్‌ను చుట్టుముట్టి నిర్బంధించడం, తదితర పరిణామాలపై ఇప్పటికే వీడియో టేపులను కేంద్రం పరిశీలించినట్లు ప్రచారం జరుగుతోంది. 
 
అంతేకాదు గవర్నర్‌ ద్వారా సమాచారం తెప్పించుకునే ప్రయత్నాల్లో కేంద్రం ఉంది. రెండు సభల్లో జరిగిన పరిణామాలపై స్పీకర్‌, చైర్మన్‌ నుంచి వివరాలను గవర్నర్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలతో కేంద్రానికి గవర్నర్ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఈ నివేదిక వచ్చిన తర్వాత దాన్ని హోంశాఖ అధికారులు పరిలీంచనున్నారు. ఆ తర్వాత కేంద్రం చర్యలు చేపట్టే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తోంది. తమను ధిక్కరించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తమదైనశైలిలో గుణంపాఠం చెప్పాలన్న ధోరణిలో కేంద్రం పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments