Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై ఏపీలో ఇంగ్లీషులోనే డిగ్రీ కోర్సులు - జగన్ సర్కారు ఆదేశం

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (17:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, ఇకపై డిగ్రీ కోర్సులను ఇంగ్లీషులోనే మొదలుపెట్టాలని నిర్ణయించింది. 
 
తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నత విద్యామండలి తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇకపై రాష్ట్రంలోని డిగ్రీ కోర్సులన్నీ కూడా ఇంగ్లీష్ మాధ్యమంలోనే అమలు కానున్నాయి.
 
'ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలు డిగ్రీ కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోనే అందించాలని.. అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కాలేజీలు తెలుగులో అమలు చేస్తున్న కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుకోవాలని' ఉన్నత విద్యామండలి సూచించింది. ఇవి కొత్త విద్యా సంవత్సరమైన 2021-22 నుంచే వర్తిస్తాయని తెలిపింది.
 
లాంగ్వేజ్ కోర్సులు మినహాయించి.. మిగిలిన విభాగాల కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుకునేందుకు ఈ నెల 18 నుంచి 28లోగా ప్రతిపాదనలు పంపాలని సూచించింది. గడువులోపు సమర్పించకపోతే.. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయా కోర్సుల నిర్వహణకు అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. 
 
కాగా, కొత్త విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా ఇంగ్లీష్‌ మీడియంలోనే కోర్సులను అందించాలని ఫిబ్రవరి 12వ తేదీన సీఎం వైఎస్ జగన్ ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments