Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటక ప్రాంతాల్లో మరో 300 వైన్ షాపులు, ఇదేనా మ‌ద్య‌నిషేధం?

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (12:02 IST)
జగన్ రెడ్డి చెప్పిన మద్యపాన నిషేదం హామీ ఏమైంది? మద్యం షాపులు పెంచట‌మేనా మద్యపాన నిషేధ‌మా? అని ఏపీ టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌శ్నించారు.

ఉన్న మద్యం షాపులు చాలవన్నట్లుగా పట్టణాలు, పర్యాటక ప్రాంతాల్లో మరో  300 షాపులు ఏర్పాటు చేయటం ప్రజలను మోసం చేయటమే అన్నారు. గ్రామాల్లో మద్యం షాపు లేని బజారు ఉందా? మద్యాన్ని ఏరులై పారిస్తూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారు... జగన్ రెడ్డి తన కమిషన్ల కోసం  నాసిరకం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల  ప్రాణాలతో చెలగాటమాడుతున్నార‌ని విమ‌ర్శించారు. 
 
మద్యంపై వచ్చే ఆదాయం చూపి ఏపీ అభివృద్ది కార్పోరేషన్ ద్వారా  రూ. 25 వేల కోట్లు అప్పు తెచ్చార‌ని, అప్పులు తెచ్చి అవి తీర్చలేక మద్యం రేట్లు పెంచి మందుబాబుల రక్తంతో, వారి కుటుంబాల కన్నీళ్లతో ఆ అప్పులు తీర్చాలని చూస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. మద్యం ఆదాయం మత్తులో మునిగిన వైసీపీ ప్రభుత్వానికి మహిళలు మత్తు వదిలించటం ఖాయమ‌ని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments