Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదిని దాటుకెళ్తూ పరీక్ష కోసం సాహసం.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (16:12 IST)
woman
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక యువతి సాహసం చేసింది. పీకల్లోతు వరద నీటిలో నడుచుకుంటూ మరీ విజయనగరం నుండి విశాఖపట్నం బయలుదేరింది.  
 
వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం, మర్రివలస గ్రామానికి చెందిన తడ్డి కళావతి అనే యువతి విశాఖలో పరీక్షకు హాజరయ్యేందుకు ఓ పెద్ద సాహసమే చేసింది. భారీ వర్షాల కారణంగా చిత్రావతి నదిలో వరద నీరు చేరడంతో.. ఆ గ్రామానికి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 
 
ఎవరూ బయటకు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. అలాంటిది కళావతి అనే యువతి మాత్రం పరీక్ష రాయడం కోసం ఇల్లు దాటి బయటకు వచ్చింది. తనకు పరీక్ష ఉండడంతో పరీక్షకు ఖచ్చితంగా హాజరవ్వాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం నదిని దాటేందుకు సిద్ధమైంది.
 
సోదరుల సహకారంతో వారి భుజాలపై నదిని దాటి.. అక్కడి నుంచి మరో వాహనంలో విశాఖ చేరుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments