Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమరావతి దెయ్యాల రాజధాని.. సెలవిచ్చిన ఏపీ వైకాపా మంత్రి

gudiwada amarnadh
, శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (17:18 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని వైకాపా నేతలు తమ నోటికొచ్చినట్టు సంభోదిస్తున్నారు. గతంలో ఈ అమరావతిని శ్మశాన వాటికతో పోల్చారు. అలాంటి చోట మనుషులు నివసించలేరంటూ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి వారు వ్యాఖ్యానించారు. ఇపుడు మరో ఏపీ మంత్రి అమరావతిని దెయ్యాల రాజధానిగా అభివర్ణించి తన నోటి దూలను తీర్చుకున్నారు. పైగా, మూడు రాజధానులపై కొత్త బిల్లును తీసుకొచ్చి ముందుకెళ్లాతమని స్పష్టం చేశారు. ఆ మంత్రి పేరు గుడివాడ అమర్నాథ్. రాష్ట్ర పరిశ్రమలశాఖా మంత్రి. ఆయన తాజాగా మాట్లాడుతూ, అమరావతి దేవతల రాజధాని కాదన్నారు. అది ఒక దెయ్యాల రాజధాని అని వ్యాఖ్యానించారు. 
 
ఈ నెల 12వ తేదీన అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు మహా పాదయాత్రను చేపట్టనున్నారు. దీనికి ఏపీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించడంతో పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. హైకోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించారు. కానీ, వైకాపా మంత్రి అమర్నాథ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామన్నారు. ఇది వరకు ప్రతిపాదించిన బిల్లుపై పలు అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో కొత్త బిల్లును తీసుకునిరానున్నట్టు తెలిపారు. పనిలోపనిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఘాటైన విమర్శలు గుప్పించారు. గాడిదకు కొమ్ములు వచ్చినా.. ముసలోడికి పిచ్చి వచ్చినా భరించడం కష్టమన్నారు. ఇపుడు చంద్రబాబు వ్యాఖ్యలు అదే తరహాలో ఉన్నాయన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు అడ్డాపై ఫోకస్ పెట్టిన వైకాపా అధినేత!