Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఐటీ మద్రాస్ నివేదిక ఇచ్చింది వైఎస్ మేనత్త కొడుకా?

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (12:54 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఏమాత్రం అనువైనది కాదనీ, ఇక్కడ నిర్మాణం చేపట్టాలంటే భారీ వ్యయం అవుతుందంటూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారు పదేపదే ప్రచారం చేసింది. మంత్రులు కూడా ఈ విషయాన్ని పదేపదే చెబుతూ వచ్చారు. అలాగే, అమరావతి అంశంపై వైకాపా సర్కారు ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూపులు వేర్వేరుగా నివేదికలు ఇచ్చాయి. 
 
ముఖ్యంగా, అమరావతి మట్టి భారీ నిర్మాణాలకు అనుకూలంగా లేదని ఐఐటీ మద్రాస్ ఓ నివేదిక ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఈ నివేదికను కూడా బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూపు సమర్పించిన నివేదికలో కూడా పొందుపరిచింది. అయితే, ఈ నివేదికలన్నీ వైఎస్ బంధువులే ఇచ్చినట్టు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. 
 
దేశంలోఉన్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటై ఐఐటీ మద్రాస్ ఓ నివేదిక ఇచ్చిందని ప్రచారం జరిగింది. ఇదికూడా వైఎస్ మేనత్త కుమారుడైన పీటర్ ఇచ్చినట్టు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంమీద అమరావతి రాజధాని మార్పుపై ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలన్నీ వైఎస్ బంధులు లేదా ఆయన సన్నిహితులే ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. 
 
మొత్తంమీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి అనేది లేకుండా చేయడానికి, ఒక వ్యక్తిపై ఉన్న కక్షతో ఈ తరహా వ్యవహరిస్తున్నారంటూ విపత్రక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో జగన్ సర్కారు ఇపుడు మరో కొత్త వివాదంలో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments