Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఐటీ మద్రాస్ నివేదిక ఇచ్చింది వైఎస్ మేనత్త కొడుకా?

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (12:54 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఏమాత్రం అనువైనది కాదనీ, ఇక్కడ నిర్మాణం చేపట్టాలంటే భారీ వ్యయం అవుతుందంటూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారు పదేపదే ప్రచారం చేసింది. మంత్రులు కూడా ఈ విషయాన్ని పదేపదే చెబుతూ వచ్చారు. అలాగే, అమరావతి అంశంపై వైకాపా సర్కారు ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూపులు వేర్వేరుగా నివేదికలు ఇచ్చాయి. 
 
ముఖ్యంగా, అమరావతి మట్టి భారీ నిర్మాణాలకు అనుకూలంగా లేదని ఐఐటీ మద్రాస్ ఓ నివేదిక ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఈ నివేదికను కూడా బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూపు సమర్పించిన నివేదికలో కూడా పొందుపరిచింది. అయితే, ఈ నివేదికలన్నీ వైఎస్ బంధువులే ఇచ్చినట్టు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. 
 
దేశంలోఉన్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటై ఐఐటీ మద్రాస్ ఓ నివేదిక ఇచ్చిందని ప్రచారం జరిగింది. ఇదికూడా వైఎస్ మేనత్త కుమారుడైన పీటర్ ఇచ్చినట్టు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంమీద అమరావతి రాజధాని మార్పుపై ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలన్నీ వైఎస్ బంధులు లేదా ఆయన సన్నిహితులే ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. 
 
మొత్తంమీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి అనేది లేకుండా చేయడానికి, ఒక వ్యక్తిపై ఉన్న కక్షతో ఈ తరహా వ్యవహరిస్తున్నారంటూ విపత్రక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో జగన్ సర్కారు ఇపుడు మరో కొత్త వివాదంలో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments