Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లి కాటుకు ఇద్దరు మహిళలు మృతి.. తర్వాత పిల్లి కూడా...

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (11:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములవాడలో విషాదం చోటుచేసుకుంది. పిల్లి కాటుకు ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆ పిల్లి కూడా మృత్యువాతపడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వేములవాడ గ్రామంలోని దళితవాడకు చెందిన రిటైర్డ్ కండక్టర్ సాలి భాగ్యారావు అనే వ్యక్తి భార్య కమల, ఇదే గ్రామానికి చెందిన ప్రైవేటు వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణిని రెండు నెలల క్రితం ఓ పిల్లి కరిచింది. వైద్యుల సలహా మేరకు వారిద్దరూ టీటీ ఇంజెక్షన్లు వేయించుకున్నారు. గాయాలు తగ్గేందుకు మందులు కూడా వాడారు.
 
ఇంతవరకు బాగానే వుంది. కానీ, నాలుగు రోజుల క్రితం వారిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారిద్దరిని మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన వారిద్దరిలో నాగమణి శనివారం తెల్లవారుజామున మృతి చెందగా, శనివారం ఉదయం 10 గంటలకు మరణించింది. పిల్లి కరవడంతో వీరిద్దరీ ర్యాబిస్ వ్యాధి సోకిందని అందుకే వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. అలాగే, ఇద్దరు మహిళలను కరిచిన పిల్లి కూడా మరణించిందని గ్రామస్తులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments