Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు.. బీరాపేరులో పడిన ఆటో

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (12:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. ముఖ్యంగా, నెల్లూరు జిల్లాల్లో ఓ ఆటో వాగులోపడింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ఐదుగురు గల్లంతయ్యారు. ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. అలాగే, విజయనగేరం జిల్లాలో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 22 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. 
 
నెల్లూరు జిల్లా ఆత్మకూరు జ్యోతినగర్‌కు చెందిన కె.నాగభూషణం కుటుంబం సభ్యులు సంగంలోని సంగమేశ్వరాలయంలో నిద్ర చేసేందుకు ఆటోలో బయలుదేరారు. ఈ ఆటో బీరాపేరు వాగు వంతెనపై వెళుతుండగా, ఎదురుగా వచ్చిన రెండు లారీలు ఒక్కదాన్నొకటి ఓవర్ టేక్ చేసే క్రామంలో ఓ లారీ ఆటోను ఢీకొట్టింది. 
 
ఆ ఆటో వాగులోకి పడిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అదించారు. వారు వచ్చి ఆటోలో ఉన్న 12 మందిని రక్షించారు. వీరిలో ఐదుగురు గల్లంతయ్యారు. ఓ బాలిక మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
అలాగే, విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామలవలస వద్ద జరిగిన మరో ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే, చింతాడవలసకు చెందిన 35 మది ట్రాక్టర్‌లో కిండాం అగ్రహారంలో జరిగిన వివాహానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చామలవలస వద్ద వీరి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందిని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments