Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరిలో ముగ్గురు యువకులు బలి.. స్నానాలకు వెళ్లి.. గల్లంతయ్యారు.. చివరికి?

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (13:16 IST)
గోదావరిలో ముగ్గురు యువకులు బలైపోయారు. ఆ ముగ్గురు యువకులూ స్నానాలకు వెళ్లి గల్లంతయ్యారు. ఈ ముగ్గురు శుక్రవారం గోదావరి నదిలో విగతజీవులుగా తేలారు. యువకుల మృతి వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం గ్రామీణ మండలం శెట్టిపేటకు చెందిన కూడిపూడి ప్రేమ్ సాగర్(17), మామిడిశెట్టి బాలవెంకట రమణ(19, ఫణికుమార్(19)) స్నేహితులు. బుధవారం వీరంతా అమలాపురం నుంచి ముమ్మిడివరం మండలం గేదెల్లంక ఉత్తర వాహిణీ పుష్కర రేవు వద్దకు స్నానాలకు వెళ్లి గోదావరిలో గల్లంతయ్యారు.
 
అయితే, ఈ ముగ్గురు యువకులు ఎక్కడికి వెళ్లారనే విషయంపై కుటుంబసభ్యులకు సమాచారం లేకపోవడంతో వారి కోసం గాలింపు చేపట్టారు. ఆ తర్వాత గురువారం వారి తల్లిదండ్రులు అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో యువకుల మొబైల్ కాల్ చేయగా ఓ పశువుల కాపరి వాళ్ల పోన్లో మాట్లాడాడు.
 
పుష్కర రేవు వద్ద బైక్‌పై బట్టలు, ఫోన్లు ఉన్నాయని, నదిలో ఓ మృతదేహం తేలియాడుతోందని అతడు చెప్పాడు. ఆ యువకుల మొబైల్ ఫోన్ల సిగ్నళ్లు కూడా అక్కడే గుర్తించడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరిపారు. ఆ తర్వాత పోలీసులు, కుటుంబసభ్యులు సంఘటనా స్థలికి చేరుకుని యువకుల మృతదేహాలను గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Chiru: మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తి

Vijay Antony: భద్రకాళి కొత్త పొలిటికల్ జానర్ మూవీ : విజయ్ ఆంటోనీ

వై.ఎస్. గురించి మీకు ముందే తెలుసా ! అని అడిగారు : దర్శకుడు శశికిరణ్‌ తిక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments