Webdunia - Bharat's app for daily news and videos

Install App

టంగుటూరులో విషాదం - ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (11:53 IST)
ప్రకాశం జిల్లా టంగుటూరులో విషాదం జరిగింది. ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. సోమవారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
టంగుటూరు మండలంలోని ఎం.నిడమానూరుకు చెందిన ముగ్గురు విద్యార్థులు మూసీ నదిలో ఈతకు వెళ్లారు. అయితే, ముగ్గురు విగతజీవులుగా మారారు. మృతులను వాసు (15), జగన్ (12), మహేష్ (13)లుగా గుర్తించారు. వీరంతా నిడమానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. 
 
ఆదివారం సెలవురోజు కావడంతో మధ్యాహ్నం సమయంలో క్రికెట్ ఆడేందుకు పొందూరు పంచాయతీ పొదవారిపాళెం సమీపంలోవున్న మూసీ నది వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ముగ్గురు విద్యార్థులు నదిలో స్నానం చేసేందుకు దిగారు. అంతే ఆ ముగ్గురు నీటిలో కొట్టుకునిపోయారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలించగా, సోమవారం ఉదయం మొదట రెండు మృతదేహాలను గుర్తించారు. ఆ తర్వాత మరో మృతదేహం కూడా లభ్యమైనట్టు పోలీసులు వెల్లడించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments