Webdunia - Bharat's app for daily news and videos

Install App

టంగుటూరులో విషాదం - ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (11:53 IST)
ప్రకాశం జిల్లా టంగుటూరులో విషాదం జరిగింది. ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. సోమవారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
టంగుటూరు మండలంలోని ఎం.నిడమానూరుకు చెందిన ముగ్గురు విద్యార్థులు మూసీ నదిలో ఈతకు వెళ్లారు. అయితే, ముగ్గురు విగతజీవులుగా మారారు. మృతులను వాసు (15), జగన్ (12), మహేష్ (13)లుగా గుర్తించారు. వీరంతా నిడమానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. 
 
ఆదివారం సెలవురోజు కావడంతో మధ్యాహ్నం సమయంలో క్రికెట్ ఆడేందుకు పొందూరు పంచాయతీ పొదవారిపాళెం సమీపంలోవున్న మూసీ నది వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ముగ్గురు విద్యార్థులు నదిలో స్నానం చేసేందుకు దిగారు. అంతే ఆ ముగ్గురు నీటిలో కొట్టుకునిపోయారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలించగా, సోమవారం ఉదయం మొదట రెండు మృతదేహాలను గుర్తించారు. ఆ తర్వాత మరో మృతదేహం కూడా లభ్యమైనట్టు పోలీసులు వెల్లడించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

ఖైరతాబాద్ గణేషుని సమక్షంలో తల్లాడ కె.పి.హెచ్.బి. కాలనీలో చిత్రం

Lavanya Tripathi : టన్నెల్ ట్రైలర్ లో లావణ్య త్రిపాఠి, అధర్వ మురళీ కాంబో అదిరింది

మదరాసి చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా : శివకార్తికేయన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments