Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యంమత్తులో ఇంటి యజమానిని హత్యచేసిన వ్యక్తి

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (16:14 IST)
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో మద్యంమత్తులో ఇంటి యజమానిని ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ దారుణం పట్టణంలోని చాకలి వీధిలో జరిగింది. మద్యం మత్తులో ఇంటి యజమాని ఓబులేసును ఓ వ్యక్తి హత్య చేశాడు.

రాజశేఖర్ అనే వ్యక్తి మద్యం సేవించి ఇంటికి వచ్చి పెద్దగా నోటికి కొచ్చినట్టు  మాట్లాడుతుండటంతో.. ఇంటి యజమాని ఎందుకు ఇలా అరుస్తున్నావని మందలించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఓబులేసు.. ఇంటి యజమానితో ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత ఆయన్ను హత్యచేశాడు.
 
ఐదు నెలల క్రితం రాజశేఖర్ ఇంటిలో అద్దెకు దిగిన ఓబులేసు... ఆయన వేధింపులు తాళలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత మద్యానికి బానిసైన రాజశేఖర్ ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి అరిచేవాడు.

ఇదే విషయంపై ఇంటి యజమాని నిలదీయడంతో దాడి చేసి అతి కిరాతకంగా కొట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఓబులేసు కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments