Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యంమత్తులో ఇంటి యజమానిని హత్యచేసిన వ్యక్తి

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (16:14 IST)
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో మద్యంమత్తులో ఇంటి యజమానిని ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ దారుణం పట్టణంలోని చాకలి వీధిలో జరిగింది. మద్యం మత్తులో ఇంటి యజమాని ఓబులేసును ఓ వ్యక్తి హత్య చేశాడు.

రాజశేఖర్ అనే వ్యక్తి మద్యం సేవించి ఇంటికి వచ్చి పెద్దగా నోటికి కొచ్చినట్టు  మాట్లాడుతుండటంతో.. ఇంటి యజమాని ఎందుకు ఇలా అరుస్తున్నావని మందలించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఓబులేసు.. ఇంటి యజమానితో ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత ఆయన్ను హత్యచేశాడు.
 
ఐదు నెలల క్రితం రాజశేఖర్ ఇంటిలో అద్దెకు దిగిన ఓబులేసు... ఆయన వేధింపులు తాళలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత మద్యానికి బానిసైన రాజశేఖర్ ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి అరిచేవాడు.

ఇదే విషయంపై ఇంటి యజమాని నిలదీయడంతో దాడి చేసి అతి కిరాతకంగా కొట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఓబులేసు కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments