Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్‌కు సిద్ధపడితే రండి లేదా భోజనం పెడతాం సరిహద్దుల్లో ఉండండి : సీఎం జగన్

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (17:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో 13కు చేరాయి. మరికొందరి రిపోర్టులు రావాల్సివుంది. తాజాగా అధికార పార్టీకి చెందిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో హోం క్వారంటైన్‌లో ఉంచారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలపై సీఎం జగన్ శనివారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి సరిహద్దుల్లో వసతులు, భోజనం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ సరిహద్దుల్లో ఉండేవారు 14 రోజులు క్వారంటైన్‌కు సిద్ధ పడేవారిని రాష్ట్రంలోని అడుగుపెట్టనివ్వాలని కోరారు. 
 
నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలకు తగ్గట్టుగా రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలను అందుబాటులోకి తీసుకురావాలని... ఆ తర్వాత వాటి కొనుగోలు సమయాన్ని తగ్గించాలని చెప్పారు. కరోనా బాధితుల చికిత్స కోసం స్వచ్ఛందంగా వచ్చే  వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలని జగన్ సూచించారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి 10 మందికి ఒక డాక్టర్‌ను కేటాయించాలని చెప్పారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ఐసోలేషన్‌కు తరలించాలని, ఇందులో ఏమాత్రం ఉదాసీనత ప్రదర్శించవద్దని సీఎం అధికారులను కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments