Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్‌కు సిద్ధపడితే రండి లేదా భోజనం పెడతాం సరిహద్దుల్లో ఉండండి : సీఎం జగన్

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (17:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో 13కు చేరాయి. మరికొందరి రిపోర్టులు రావాల్సివుంది. తాజాగా అధికార పార్టీకి చెందిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో హోం క్వారంటైన్‌లో ఉంచారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలపై సీఎం జగన్ శనివారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి సరిహద్దుల్లో వసతులు, భోజనం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ సరిహద్దుల్లో ఉండేవారు 14 రోజులు క్వారంటైన్‌కు సిద్ధ పడేవారిని రాష్ట్రంలోని అడుగుపెట్టనివ్వాలని కోరారు. 
 
నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలకు తగ్గట్టుగా రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలను అందుబాటులోకి తీసుకురావాలని... ఆ తర్వాత వాటి కొనుగోలు సమయాన్ని తగ్గించాలని చెప్పారు. కరోనా బాధితుల చికిత్స కోసం స్వచ్ఛందంగా వచ్చే  వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలని జగన్ సూచించారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి 10 మందికి ఒక డాక్టర్‌ను కేటాయించాలని చెప్పారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ఐసోలేషన్‌కు తరలించాలని, ఇందులో ఏమాత్రం ఉదాసీనత ప్రదర్శించవద్దని సీఎం అధికారులను కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments