Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా టెస్టులు ఎవరు చేయించుకోవాలి?

కరోనా టెస్టులు ఎవరు చేయించుకోవాలి?
, శనివారం, 28 మార్చి 2020 (16:21 IST)
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు గజగజ వణికిపోతున్నారు. ఎవ‌రు తుమ్మినా, ద‌గ్గినా భ‌య‌ప‌డే ప‌రిస్థితులు నెలకొన్నాయ. సాధార‌ణ జ‌లుబు చేసినా క‌రోనా సోకిందేమోన‌న్నా భ‌యం ప్ర‌జ‌ల‌ను వెంటాడుతుంది. ఈ ప‌రిస్థితుల్లో ఎవ‌రు క‌రోనా టెస్టు చేసుకోవాలనే దానిపై కేంద్ర వైరోగ్య‌శాఖ కొన్ని సూచ‌న‌లు చేసింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. పైగా, ఎవరెవరు ఈ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాం. 
 
* గ‌డిచిన 14 రోజుల్లో విదేశాల నుంచి వ‌చ్చిన వారు, విదేశాల్లో ప్ర‌యాణం చేసిన‌వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.
* క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారిని క‌లిసిన‌, తిరిగిన వారు కూడా త‌ప్ప‌ని స‌రిగా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.
* వైద్య‌రంగంలో ప‌నిచేస్తున్న వారంద‌రూ కూడా టెస్ట్ చేసుకోవాలి.
 
* ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందిన‌,  పొందుతున్న ప్ర‌తి ఒక్క‌రూ ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందే.
* శ్వాస‌కోస సంబంధ వ్యాధులు, ఇత‌ర తీవ్ర‌మైన వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారంద‌రూ త‌ప్ప‌ని స‌రిగా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా నివారణకు ఇ-మెయిల్ ద్వారా విద్యార్థి లోకానికి పిలుపునివ్వాలన్న గవర్నర్