Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా టెస్టులు ఎవరు చేయించుకోవాలి?

Advertiesment
Coronavirus
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు గజగజ వణికిపోతున్నారు. ఎవ‌రు తుమ్మినా, ద‌గ్గినా భ‌య‌ప‌డే ప‌రిస్థితులు నెలకొన్నాయ. సాధార‌ణ జ‌లుబు చేసినా క‌రోనా సోకిందేమోన‌న్నా భ‌యం ప్ర‌జ‌ల‌ను వెంటాడుతుంది. ఈ ప‌రిస్థితుల్లో ఎవ‌రు క‌రోనా టెస్టు చేసుకోవాలనే దానిపై కేంద్ర వైరోగ్య‌శాఖ కొన్ని సూచ‌న‌లు చేసింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. పైగా, ఎవరెవరు ఈ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాం. 
 
* గ‌డిచిన 14 రోజుల్లో విదేశాల నుంచి వ‌చ్చిన వారు, విదేశాల్లో ప్ర‌యాణం చేసిన‌వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.
* క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారిని క‌లిసిన‌, తిరిగిన వారు కూడా త‌ప్ప‌ని స‌రిగా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.
* వైద్య‌రంగంలో ప‌నిచేస్తున్న వారంద‌రూ కూడా టెస్ట్ చేసుకోవాలి.
 
* ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందిన‌,  పొందుతున్న ప్ర‌తి ఒక్క‌రూ ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందే.
* శ్వాస‌కోస సంబంధ వ్యాధులు, ఇత‌ర తీవ్ర‌మైన వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారంద‌రూ త‌ప్ప‌ని స‌రిగా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా నివారణకు ఇ-మెయిల్ ద్వారా విద్యార్థి లోకానికి పిలుపునివ్వాలన్న గవర్నర్