Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో మృతి చెందితే అంత్యక్రియల కోసం రూ.15వేలు.. సీఎం జగన్

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (20:04 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కరోనా మృతులకు సంబంధించి కొత్త ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా కరోనాతో మృతిచెందితే అంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి రూ.15వేలు ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశించారు. కరోనా బాధితులను నిరాకరించే ఆస్పత్రుల రద్దుకు వెనుకాడవద్దని అధికారులకు సూచించారు.
 
రాష్ట్రంలో 17వేల మంది వైద్యులు, 12వేల మంది నర్సులను భవిష్యత్‌ అవసరాల కోసం నియమిస్తామని సీఎం జగన్‌ తెలిపారు. క్వారంటైన్‌ కేంద్రాలు, వసతులు, భోజనం తదితర వాటిపై ప్రత్యేక దృష్టిని సారించాలని అధికారులకు సూచించారు.
 
వచ్చే వారం రోజులు ఆస్పత్రులపై స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. క్రమం తప్పకుండా ఆస్పత్రులను సందర్శించాలన్నారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లల్లో ప్రత్యేక బస్సుల ద్వారా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. కరోనా పరీక్ష కేంద్రాలను శాశ్వత పరీక్షల కేంద్రంగా మార్చాలని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments