Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే బోర్డులో నేరచరితులా? ఏపీ హైకోర్టు ఆగ్రహం

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (13:06 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో నేర చరితులను నియమించడం పట్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. 
 
నేరచరిత్ర ఉన్న వారిని నియమించిన వారికి నోటీసులివ్వాలని, దానిపై వివరణ తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవోకు నోటీసులివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లోగా దీనిపై రిపోర్టు ఇవ్వాలని సర్కారుకు స్పష్టం చేసింది. 
 
మరోవైపు, తితిదే బోర్డులో పదుల సంఖ్యలో అయినవారికి, బడా పారిశ్రామికవేత్తలకు చోటు కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా, దీనికి హైకోర్టు మోకాలొడ్డింది. దీంతో చట్ట సవరణ ద్వారా తమ పనిని పూర్తి చేయాలన్న ఆలోచనలో ఏపీ సర్కారు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 28వ తేదీన జరిగే కేబినెట్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments