Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే బోర్డులో నేరచరితులా? ఏపీ హైకోర్టు ఆగ్రహం

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (13:06 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో నేర చరితులను నియమించడం పట్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. 
 
నేరచరిత్ర ఉన్న వారిని నియమించిన వారికి నోటీసులివ్వాలని, దానిపై వివరణ తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవోకు నోటీసులివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లోగా దీనిపై రిపోర్టు ఇవ్వాలని సర్కారుకు స్పష్టం చేసింది. 
 
మరోవైపు, తితిదే బోర్డులో పదుల సంఖ్యలో అయినవారికి, బడా పారిశ్రామికవేత్తలకు చోటు కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా, దీనికి హైకోర్టు మోకాలొడ్డింది. దీంతో చట్ట సవరణ ద్వారా తమ పనిని పూర్తి చేయాలన్న ఆలోచనలో ఏపీ సర్కారు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 28వ తేదీన జరిగే కేబినెట్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments