Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కర్ఫ్యూను పొడిగింపు.. మినహాయింపు కూడా..?

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (14:19 IST)
ఏపీలో కర్ఫ్యూను పొడిగించాలని సర్కారు భావిస్తోంది. మే 5 నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వం దశల వారీగా కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న కర్ఫ్యూ ఈ నెల 20తో ముగియనుంది. 
 
గతంలో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో కర్ఫ్యూ సమయాన్ని కుదించనున్నారు. రెండు, మూడు రోజుల్లో సీఎం జగన్‌ నిర్వహించే సమీక్షా సమావేశంలో కర్ఫ్యూ అమల్లో ఇవ్వాల్సిన మినహాయింపులపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. 
 
కరోనా కట్టడి కోసం నెల రోజులకు పైగా అమలు చేస్తున్న కర్ఫ్యూ సత్ఫలితాలు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాన్ని మరికొద్ది రోజులు పొడిగించాలని యోచిస్తోంది. అయితే ప్రస్తుతం ఇస్తున్న సడలింపులకు తోడు మరికొన్ని మినహాయింపులు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపిస్తోంది.
 
దీంతో ఈ నెల 21 నుంచి సాయంత్రం 6 గంటల నుంచి మరసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం కర్ఫ్యూను మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు అమలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments