Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూన్ 10 వరకు..?

Webdunia
సోమవారం, 31 మే 2021 (16:05 IST)
ఏపీలో కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజు రోజుకూ కేసులు తగ్గుతున్నప్పటికీ.. కరోనా కట్టడికి మరికొన్ని రోజులు కర్ఫ్యూని కఠినంగా అమలు చేయడమే మంచిదని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చారు. ఏపీలో కరోనా పరిస్థితులపై రివ్యూ నిర్వహించిన సీఎం జగన్.. రాష్ట్రంలో ప్రస్తుత కేసులు.,. రికవరీ రేటు తదితర అంశాలపై చర్చించారు. గతంతో పోల్చుకుంటే కరోనా కంట్రోల్ అయినప్పటికే.. మరింత కఠినంగా ఉండాల్సిందే అని ఆయన అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. 
 
కరోనాను పూర్తిగా కట్టడి చేయాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జూన్ 10 వరకు కర్ఫ్యూను పెంచాలని అధికారులకు ఆదేశించారు. కర్ఫ్యూ సడలింపులపైనా ఈ సమావేశంలో చర్చించారు. అయితే ముఖ్యంగా కరోనా చైన్ తెగిపోవాలి అంటే మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందని సీఎం జగన్ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకు అమలు చేస్తున్న సడలింపుల్లో ఎలాంటి మినహాయింపులు ఇవ్వొద్దని సీఎం జగన్ స్పష్టం చేశారు. 
 
మరో 10 రోజులు పాటు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్ర‌భుత్వం.. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ అవసరాల నిమిత్తం స‌డ‌లింపులు ఉండ‌గా.. ఆ స‌మ‌యాన్ని కూడా య‌థాత‌థంగా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments