Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించనున్న సీఎం జగన్

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (10:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా థర్డ్ వేవ్ కారణంగా పొంచివున్న ముప్పును ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతుంది. ఇందులోభాగంగా, వైద్య మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతుంది. మెరుగుపరుస్తుంది కూడా. ఇందులోభాగంగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. 
 
వీటిని సీఎం వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఒమిక్రాన్ వైరస్ ప్రభావంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా నమోదవుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్లు కోవిడ్ మహమ్మారి బారినపడిన వారికి చికిత్స అందించండంలో కీలక పాత్ర పోషించనున్నాయి. 
 
ఈ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఆస్పత్రుల ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేసింది. ప్రెజర్ స్వింగ్ అబ్జార్షన్ పద్ధతిలో తయారైన ఆక్సిజన్, పైపులైన్ల ద్వారా నేరుగా రోగికి చేరుతుంది. అలాగే, ఈ ఆక్సిజన్‌ను సిలిండర్లలో కూడా నింపవచ్చు. వివిధ సామర్థ్యాలతో ఈ పీఎస్ఏ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 1000 ఎల్పీఎం, 500 ఎల్పీఎం సామర్థ్యంలో వీటిని ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments