Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మే 2నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు

Advertiesment
Inter Exams
, శనివారం, 8 జనవరి 2022 (10:20 IST)
మే 2నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు రంగం సిద్ధం చేస్తోంది. వివిధ పోటీ పరీక్షలతో ఈ ఎగ్జామ్స్ లింక్ అయి ఉండటంతో మే 2 నుంచి 20 వరకు నిర్వహించాలని యోచిస్తోంది. మరోవైపు ఏపీలోనూ మే 5 నుంచి 22 వరకూ ఇంటర్ పరీక్షలు ఉండే అవకాశముంది. 
 
ఎంసెట్, జేఈఈ, నీట్ తదితర ఎగ్జామ్స్​ను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షల షెడ్యూల్​ను ఇంటర్ బోర్డు తయారు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 9 లక్షలకు పైగా స్టూడెంట్లు ఇంటర్ చదువుతున్నారు. 
 
గతేడాది కొవిడ్ ఎఫెక్ట్ తో పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో సెకండియర్ స్టూడెంట్లను ఫస్టియర్ మార్కుల ఆధారంగా పాస్ చేసింది. ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న స్టూడెంట్లకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆప్కో చేనేత డిజైన్లను చూసి అచ్చెరువొందిన సుచరిత